జహీరాబాద్ ఎంపీ. బీబీ పాటిల్ కి సొంత బిజినెస్ పై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై లేదని, ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు ఆరోపించారు. మంగళవారం రాత్రి ఎల్లారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. జహీరాబాద్ ఎంపీగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థి బీబీ పాటిల్ కాదు బైబై పాటిల్ అన్నారు. పదేళ్లు ఎంపీ సెగ్మెంట్ పాలించి పది ఊర్లు తిరగలేదు, పది ఇండ్లు ఇవ్వలేదని, ఏం మొహం పెట్టుకొని ఓట్ల కోసం వస్తుండని ప్రశ్నించారు.