దేవీ నవరాత్రుల సందర్భంగా భవాని దీక్షలు స్వీకరించిన సాములు

56చూసినవారు
దేవీ నవరాత్రుల సందర్భంగా భవాని దీక్షలు స్వీకరించిన సాములు
లింగంపేట్ మండలం శెట్ పల్లి గ్రామంలో గురువారం ఉదయం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో 8వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గామాత ప్రతిమను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా అమ్మవారి మాల దీక్షను స్వీకరించారు. తొలి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అలంకరించారు. ప్రత్యేక పూజా నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిల్లి అశోక్, అట్టెం సాయిరాం, పిల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్