చొప్పదండి మున్సిపల్ పరిధిలో సిఎస్ఐ చర్చి దగ్గర కొత్తూరి హనుమమ్మ గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మరణించడం జరిగింది. వారి ఆర్థిక పరిస్థితి బాగులేనందున చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ తరపున వారి దహన సంస్కారాల నిమిత్తం 3000/-రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిట్ట కుమార్, మహమ్మద్ చాంద్ పాషా, దుడం ఈశ్వర్, గంగు రాజు, సభ్యులు పాల్గొన్నారు.