ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

72చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం రోజు జిల్లా కలెక్టర సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల 25 నిమిషాలు అయినప్పటికీ ఫార్మసిస్ట్, ఆయుష్ తప్ప మిగతా సిబ్బంది ఎవరు కూడా ఆసుపత్రిలో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డిఎంహెచ్ఓ కి ఫోన్ చేసి దీనిపై ఆరా తీశారు. సమయపాలన పాటించపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్