రైతులను ఇబ్బంది పెట్టకండి: సివిల్ సప్లై కమిషనర్
అకాల వర్షాల వల్ల రైతులు ఆందోళన చెందవద్దని, తడిచిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహన్ పేర్కొన్నారు. మల్యాల మండలం రామన్నపేట, మల్యాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులు, సిబ్బందితో మాట్లాడారు. కొనుగోలు పక్రియ ఆలస్యం చేయొద్దని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా కొనుగోలు చేయాలన్నారు.