ధర్మారంలో ఘనంగా యోగా దినోత్సవం

61చూసినవారు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువులు జంగిలి సుధాకర్ మంజుల దంపతుల ఆధ్వర్యంలో ధర్మారం పట్టణంలో ఉదయం ర్యాలీ నిర్వహించి యోగా విశిష్టతను స్థానికులకు తెలియజేశారు. యోగా నేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా అభ్యాసకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్