తాగిన మైకంలో భార్యను కడతేర్చిన భర్త

31505చూసినవారు
తాగిన మైకంలో భార్యను కడతేర్చిన భర్త
తాగిన మైకంలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రజిత(38)కు ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన పున్నంరెడ్డికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 11 ఏళ్ల పాప ఉంది. కొంతకాలంగా మద్యానికి బానిసైన పున్నంరెడ్డి రాత్రి మద్యం సేవించి రజితతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో రజిత తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్