సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో చంద్రబాబు మాట్లాడుతూ.. ముసుగు వీరుడు పరదాలు దాటి.. బయటకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు. జగన్కు ఏ ఒక్కరూ స్వాగతం చెప్పకూడదని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఒకవేళ జగన్కు సహకరిస్తే సీమకు అన్యాయం చేసినవారు అవుతారని పేర్కొన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి.. అందుకే జగన్ను ఇక్కడకు రాకుండా జనం అడ్డుకోవాలని అన్నారు.