ధర్మారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

558చూసినవారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్