వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భక్తుల తాకిడి

65చూసినవారు
వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గురువారం భక్తులు పోటెత్తారు. వేకువ జామునే అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించారు. అనంతరం నరసింహుడిని దర్శించుకున్నారు. అలాగే దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్