నరసింహుడి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం

67చూసినవారు
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ శుక్రవారం సాధారణంగా ఉంది. వేకువజామునే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి, ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్