వెల్గటూర్ మండలం చర్లపల్లి గ్రామంలోని రైస్ మిల్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం ప్రకారం అతివేగంగా వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.