ధర్మారంలో నిత్య యోగా తరగతులు

568చూసినవారు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిత్య యోగా తరగతులు కొనసాగుతున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో గురువారం వేకువజామున యోగా శిక్షకులు మంజుల సుధాకర్ దంపతులు వివిధ రకాల ఆసనాలు వేసి అభ్యాసకులకు యోగా నేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నిత్యం యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అభ్యాసకులకు వివరించారు. యోగా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్