గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన కురుమ, యాదవ సంఘం నాయకులు ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు. బీరయ్య, చౌడాలమ్మ గుడికి వెళ్ళడానికి రోడ్డు లేదని, సీసీ రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అధ్యక్షుడు బొమ్మ పెద్ద నరసయ్య, గడ్డం మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.