రెండో విడత దళితబంధు విడుదల చేయాలి: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

1058చూసినవారు
రెండోవిడత దళితబంధు అమలు చేసి లబ్ధిదారుల ఇబ్బందులు తొలగించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో మాట్లాడుతూ, రెండో విడత దళితబంధు రాలేదని ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్నారని, బాధితులకు సానుభూతి తెలిపారు. బ్యాంకులు ఫ్రీజ్ చేసిన దళితబంధు అకౌంట్లను విడుదల చేయాలన్నారు. దళితబంధు అమలులో జాప్యం చేస్తే దళిత కుటుంబాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్