ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీఎస్ఎఫ్కు చెందిన జవాన్తో సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును బయటకు తీసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఔరయా జిల్లాకు చెందిన వీరంతా పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.