జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన కొండ్ర కళ్యాణ్ మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడపడంతో ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం కేసు నమోదు చేసి, సంబంధిత కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి మంగళవారం నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం తెలిపారు. మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనాలు నడపటం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.