రాయికల్ మండలం తాట్ల వాయిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాగేల్లికి చెందిన శంకర్ లక్ష్మిలకు ముగ్గురు కుమారులు చిన్న కుమారుడు సురేష్ వ్యవసాయం చేసుకుంటూ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గురువారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. గ్రామ శివారులో గాలించగా బావి వద్ద చెప్పులు, రక్తపు మరకలు, ద్విచక్ర వాహనం కనిపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వగా పోలీసులు చేరుకొని బావిలో శవాన్ని బయటికి తీశారు.