నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

81చూసినవారు
నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జగిత్యాల అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. జిల్లాలోని సారంగాపూర్, బుగ్గారం మండలాల్లోని యశ్వంత్ రావుపేట, బట్టపల్లి, పోతారం గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుండి కొనుగోలు చేసే వరి పంటను నాణ్యత గల వరి నీ కొనుగోలు చేయాలని కేంద్రం ఇంఛార్జి లను ఆదేశించారు. ఆయన వెంట ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్