భారతదేశంలో కూరగాయల సాగుకు ఖరీఫ్ అనువైన సమయం. ఖరీఫ్ లో కూరగాయలు సాగుచేసే రైతులు.. మొదట నారుపెంపకంపై జాగ్రత్తలు వహించాలి. కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి. ఈ విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది కాబట్టి.. ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. దీనికోసం ప్రోట్రేలలో నారును పెంచుకోవాలి. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువ. నారు మొక్కల్లో వేరువ్యవస్థ సమానంగా పెరుగుతుంది.