యూపీలోని బరేలీలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఇజ్జత్నగర్లోని ఓ 5 స్టార్ హోటల్లో ఏప్రిల్ 20న ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. దానికి వ్యాపారవేత్త సంజయ్ అగర్వాల్ కుమారుడు సార్థక్ అగర్వాల్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాపారి సంజీవ్ అరోరా, అతని కుమారుడు రిద్ధివ్ అరోరా కలిసి సార్థక్పై దాడి చేశారు. మద్యం మత్తులో హోటల్పై నుంచి అతడిని కిందకు విసిరేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.