డిసివోను కలిసిన ప్యాక్స్ చైర్మెన్లు

77చూసినవారు
డిసివోను కలిసిన ప్యాక్స్ చైర్మెన్లు
జగిత్యాల జిల్లా సహకార అధికారిగా నియమితులైన ఎం. రఘువరన్ ను వారి కార్యాలయంలో జగిత్యాల జిల్లా ప్రాథమిక సహకార సంఘల అధ్యక్షుల ఫోరం తరపున శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల చైర్మన్ పి. మహిపాల్ రెడ్డి, కల్లెడ చైర్మన్ సందీప్ రావు, నంచర్ల చైర్మన్ వేణుగోపాల్, జైన చైర్మన్ నరేష్, రాయికల్ చైర్మన్ మల్లారెడ్డి, చందోలి చైర్మన్ మాధవరావు లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్