లిక్కర్ వ్యాను బోల్తా

27583చూసినవారు
జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై విఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బుధవారం లిక్కర్ వ్యాన్ బోల్తా పడింది. 6 వైన్స్ లకు సంబందించిన మద్యం సీసాలు మొత్తం పగిలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ. 50 లక్షల మేర మద్యం నష్టం జరిగిందని భావిస్తున్నారు. వ్యానులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాహనాన్ని తప్పించబోయి లిక్కర్ వ్యాన్ బోల్తా పడ్డట్టు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్