జగిత్యాలలో రెచ్చిపోయిన దొంగలు

58చూసినవారు
జగిత్యాలలో రెచ్చిపోయిన దొంగలు
జగిత్యాల పట్టణంలోని శివాజీవాడలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసి బంగారు నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. తోట ప్రసాద్ అనే వ్యక్తి దసరా పండుగ నేపథ్యంలో ఇంటికి తాళం వేసి సొంత ఊరైన కరీంనగర్ వెళ్లారు. విషయం గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా పగలగొట్టి సుమారు 40 తులాల బంగారంతో పాటు 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్