రామగిరి మండలం కల్వచర్లలోని మారుతినగర్ వాస్తవ్యులు కీశే సౌమిత్రి నారాయణచార్యులు వాస్తు సిధ్ధాంతి స్మారకార్థం వారి కుమారులు శ్రీ సౌమిత్రి తిరుమలాచార్యులు కల్వచర్ల ప్రభుత్వ పాఠశాల 144 మంది విద్యార్థులకు సుమారు 35000 రూపాయలతో ఖరీదు చేసిన బూట్ల, సాక్సులను వారి తల్లిగారైన శ్రీమతి సౌమిత్రి సుగుణమ్మ చేతుల మీదుగా బుధవారం నాడు అందజేశారు.