ప్రధాని మోదీ నాయకత్వంలో బలమైన దేశంగా భారత్ అతరించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ కు మద్దతుగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో నడ్డా మాట్లాడుతూ మోడీ పాలనలో దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. బిజెపికి 400 సీట్లిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు.