మంథని నియోజకవర్గం, రామగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఆదివారం కోతికి అంత్యక్రియలు జరపడం జరిగింది. కరెంట్ షాక్ కి గురైన కోతికి, ఆపై కోతులు దాడి చేయడంతో వానరం మృతి చెందింది. సకాలంలో పశు వైద్యులు చికిత్స చేసినకూడ లాభం లేకుండా పోయింది. తదనంతరం గ్రామస్తులు వానరానికి దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకట్రావుపల్లి మాజీ ఎంపీటీసీ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.