కళాజాత బృందం ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

59చూసినవారు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఆరోగ్యశాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాజాత బృందం ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగర్ గడ్డం రమేష్ బృందం పాటలు పాడుతూ ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. కళాజాత బృందం, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్