ఛలో అయోధ్య కాల్వ శ్రీరాంపూర్ మండలం నుండి బిజెపి ఆధ్వర్యంలో సోమవారం 25 మంది అయోధ్య రామ దర్శనానికి స్పెషల్ ట్రైన్ కు వెళ్లారు. మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వరకు జైశ్రీరామ్ నినాదాలతో ర్యాలీ నిర్వహించి రామగుండం రైల్వేస్టేషన్ కు బిజెపి నాయకులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్, తోట శ్రీధర్, పోగుల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.