క్రీడా పాఠశాల ప్రవేశానికి ఎంపిక

79చూసినవారు
క్రీడా పాఠశాల ప్రవేశానికి ఎంపిక
సుల్తానాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 2024-25 సంవత్సరానికిగాను నాలుగవ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పోటీలను నిర్వహించినట్లు ఎంఈఓ సురేందర్ తెలిపారు. ఎంపిక పోటీలలో మండలంలోని వివిధ పాఠశాలల నుండి 25 మంది విద్యార్థులు పాల్గొనగా ఐదుగురు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు దివాకర్, రత్నాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్