పెద్దపల్లి: ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

64చూసినవారు
పెద్దపల్లి: ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై విద్యార్థులతో భైఠాయించి రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ రాసురి ప్రవీణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్