పెళ్లి ఇంట్లో దొంగతనం

23330చూసినవారు
పెళ్లి ఇంట్లో దొంగతనం
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో బుధవారం అర్ధరాత్రి ఓ పెళ్లి ఇంట్లో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కెక్కర్ల ఐలయ్య కుమారుడు వంశీ వివాహం బుధవారం కరీంనగర్ జిల్లాలోని చామనపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులంతా పెళ్లికి వెళ్లడంతో.. గమనించిన దుండగులు తాళం పగలగొట్టి బీరువాలోని రూ.2 లక్షల నగదు, అర తులం బంగారం దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్