షీ టీమ్స్ పై అవగాహన

63చూసినవారు
షీ టీమ్స్ పై అవగాహన
పెద్దపల్లి పట్టణంలోని ఐటిఐ కళాశాలలో గురువారం షీ టీమ్స్ పై షీ టీం ఇన్ ఛార్జి ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. షీ టీం సభ్యులు మల్లారెడ్డి, స్నేహలతలు మాట్లాడుతూ షీ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని, మహిళలను ఎవరైనా వేధిస్తే నేరుగా 100 నెంబర్ కు డయల్ చేయాలని, లేని పక్షంలో సైబర్ క్రైమ్ నెంబర్ 1930 కి డయల్ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్