ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా వచ్చిన సీఐఎస్ఎఫ్ కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో ఎన్నికల సమయoలో నిర్వహించాల్సిన విధులపై సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ భవన సమావేశంలో బుధవారం దిశానిర్దేశం చేశారు. పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు.