సి-విజిల్ యాప్ ద్వారా ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ లను మభ్య పెట్టేందుకు ఎవరైన అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫోటోలు, లైవ్ వీడియోలను సి విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని తెలిపారు.