నేరెళ్ల ఘటనపై నిష్పక్షపాత విచారణ చేయాలని సూచిస్తాం: రామచందర్

69చూసినవారు
నేరెళ్ల ఘటనపై నిష్పక్షపాత విచారణ చేయాలని సూచిస్తాం: రామచందర్
సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల ఘటనపై మరోసారి నిష్పక్షపాత విచారణ నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామ్ చందర్ అన్నారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన మాట్లాడుతూ. అన్యాయం జరిగిన నిమ్న వర్గాల ప్రజలకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందన్నారు. ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ ల్యాండ్స్ పట్టాలు అందించే అవకాశంపై రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి ఆదేశాలు జారీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్