తెలంగాణ రాష్ట్రంలో తరుచుగా తలెత్తుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ సర్కారు మరో సంస్కరణకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టం, పేదలు, రైతులకి వరంగా మారనుంది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఆర్వోఆర్ చట్టం -2024 ముసాయిదాని తీర్చిదిద్దారు. రోజురోజుకీ మారుతున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా చట్టంలో నిబంధనలు పొందుపర్చారు.