2020 అక్టోబరు 29న గత ప్రభుత్వం ఆర్వోఆర్ చట్టం తీసుకొచ్చింది. దానివల్ల పెద్దఎత్తున భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కాంగ్రెస్ సర్కారు గుర్తించింది. వాటిపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన ధరణి కమిటీ తయారు చేసిన నివేదిక ఆధారంగా పలు కీలక సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. దీంతో కొత్త చట్టం తీసుకురావడంపై రెవెన్యూశాఖ కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా సులువుగా సేవలు అందేందుకు వీలుగా కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది.