అంబులెన్స్ లోనే ప్రసవం

78చూసినవారు
అంబులెన్స్ లోనే ప్రసవం
అంబులెన్స్ లోనే మహిళ ప్రసవించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బవుసాయిపేట గ్రామానికి చెందిన షేక్ గోరేబికి పురిడినొప్పులు రాగా, కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది అంబులెన్స్ తో గోరేబి ఇంటికి చేరుకొని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇది ఈమెకు నాలుగో సంతానం కాగా ఇద్దరమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు.

సంబంధిత పోస్ట్