రాజన్న సేవలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్

56చూసినవారు
రాజన్న సేవలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వడ్లూరి లక్ష్మణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి రాగానే అర్చకులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అర్చకులు ఆశీర్వదించారు. వారి వెంట ఆలయ అధికారులతో పాటు కౌన్సిలర్ అజయ్, కాంగ్రెస్ నేత కనికరపు రాకేష్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్