వేములవాడ నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన మహమ్మద్ నవాద్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ వైద్యులతో మాట్లాడారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 2, 50వేల రూపాయలు ఇచ్చారు. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించారు.