రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలి గుండుపల్లి గ్రామంలోని శ్రీమహంకాళి బీరప్ప కామావతి కళ్యాణ మహోత్సవానికి బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావులు హాజరయ్యారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.