వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఐదు రోజులుగా జరుగుతున్న శివ కళ్యాణ మహోత్సవాలు ఆదివారంతో శాస్త్రోక్తంగా ముగిసాయని, ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం యాగశాలలో పూర్ణాహుతి పూజ నిర్వహించారు. ధర్మగుండంలో త్రిశూల యాత్రను అర్చకులు వేదమంత్రాలతో గావించారు. రాత్రి ఏకాంత సేవతో శివ కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయని అర్చక స్వాములు తెలిపారు.