రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై శాసనమండలిలో చర్చించాలని కోరుతూ మండలి చైర్మన్కు లేఖ రాశారు. ర్యాగింగ్ అనేది అమానవీయమని, మానవ హక్కుల ఉల్లంఘన అని కవిత అన్నారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని తన లేఖలో డిమాండ్ చేశారు.