నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ
By Ravinder Enkapally 4029చూసినవారుఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చనున్నారు. ఇక, కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ వివరించనుంది. కవితకు మరికొన్ని రోజులపాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశముంది.