ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆయన కోర్టును కోరారు. ఈ అంశంపై జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఇవాళ మరోసారి విచారణ చేపట్టనుంది.