తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన

77చూసినవారు
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన
తెలంగాణలో సామాన్యులపై కరెంట్ ఛార్జీలు పెంచబోమని డిస్కం సీఎండీ ముషారఫ్ స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని తెలిపారు. నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయన్న వార్తల నేపథ్యంలో ముషారఫ్ క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్