గత తెలంగాణ ప్రభుత్వంలో వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలనే ఉద్దేశంతో అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల్లో బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టారు. దీన్ని పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఒకరిని నియమించారు. ప్రతి రోజూ డాక్టర్లు, ఇతర సిబ్బంది ఆసుపత్రికి చేరుకున్నాక బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉండేది. దాని ఆధారంగానే వారికి వేతనాలు సైతం ఇచ్చేవారు. కానీ కొన్ని నెలలుగా బయోమెట్రిక్ అటెండెన్స్ అటకెక్కింది.