లోక్సభ స్పీకర్ ఎన్నిక అంశంపై తాను ఎవరితోనూ చర్చలు జరపలేదని ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. స్పీకర్ పదవికి పాలక పార్టీ సభ్యుడు ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. అయితే స్పీకర్ పదవికి పోటీ లేకుండా ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా పాలక పక్షం చూడాలని విపక్ష ఇండియా కూటమిలో చర్చించామని తెలిపారు. ఈమేరకు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలనే దానిపై తాము అంగీకరించామని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లిన తర్వాత దీనిపై ఓ స్పష్టత వస్తుందని అన్నారు.