రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర

71చూసినవారు
రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర
హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర రేపు (మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభం అవనుంది. మధ్యాహ్నం క్రేన్ దగ్గరకు ఖైరతాబాద్‌ గణపతి చేర్చి.. 2 గంటల్లో నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం హైదరాబాద్‌లో 64చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 8 వరకు ఆంక్షలు ఉంటాయి. ట్యాంక్‌ బండ్‌ దగ్గర 8 చోట్ల పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.

సంబంధిత పోస్ట్